పెద్దపల్లి : వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరంగా మారిందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో ఎంపీపీలు బాలాజీ రావు, బండారి స్రవంతి, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, రైతు సమితి అధ్యక్షుడు అశోక్ రెడ్డి, ఇతర గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.