పెద్దపల్లి : పెద్దపల్లి మండలం బొంపల్లి, కుర్మపల్లి, రాగినేడు, కనగర్తి, కాపులపల్లి, కాసులపల్లి గ్రామాల్లో అప్పన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినధాన్యం కొనుగోలు కేంద్రాలను పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..కేంద్రం ధన్యాం కొనుగోలు చేయకుండా మోసం చేసినా రైతులు గోస పడొద్దని ధాన్యం కొటున్నారని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం విక్రయించి లాభాలు పొందాలన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.