పెద్దపల్లి : ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు చేరాలని, తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు చేరే విధంగా చర్యలు చేపట్టినట్లు పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం పెద్దపెల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డులో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అందజేస్తున్న పథకాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలను అడిగితెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని స్పష్టం చేశారు. రైతుబంధు,రైతుబీమా,కల్యాణలక్ష్మి,మిషన్ భగీరథ ఇలా అనేక పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి తెలంగాణను దేశంలోనే నంబర్వన్గా నిలిపారన్నారు. అరవై ఏండ్లలో జరుగని అభివృద్ధి తొమ్మిదేండ్లలో జరిగిందని, అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంట వార్డు కౌన్సిలర్ పెద్ది గీతాంజలి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.