పెద్దపల్లి : బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. సోమవారం కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ కి చెందిన అనేక మంది నాయకులు, కార్యకర్తలు గులాబీ గూటిలో చేరారు. పార్టీలో చేరిన వారిలో గౌడ సంఘం అధ్యక్షుడు వీరగోని సదయ్య, ఉపాధ్యక్షుడు గోపగోని శ్రీనివాస్, మల్యాల శ్రీనివాస్, గోపగోని సదయ్య, చిన్నరాములు, గోపగోని శ్రీనివాస్, రంగు శంకరయ్య, అడ్డగుంట శంకరయ్య, గాజుల రాజేశం, వీరగోని లింగయ్య, మల్యాల కనకయ్య, గోపగోని రాజయ్య, అడ్డగుంట రవీందర్, మల్యాల రవీందర్, బొంగోని మల్లయ్య, రాజయ్య, పెద్ద రాములు, చిన్న మల్లయ్య, నందయ్య, సదయ్య, లక్ష్మీరాజం, పర్శరాములు,పెద్ద రాజయ్య, శ్రీనివాస్, రాజేశం, సమ్మయ్య, చంద్రమోగిళి, ఓదెలు,రాజేశం, రామస్వామి, కుమారస్వామి, మోగిళి ఉన్నారు. వీరికి పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. పార్టీలో చేరుతున్న ప్రతి కార్యకర్తకు సముచితం గౌరవం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జడ్పీటీసీ వంగళ తిరుపతి రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గొడుగు రాజ కొమురయ్య, యూత్ మండలాధ్యక్షుడు నూనెటి కుమార్, PACS చైర్మన్ గజవెల్లి పురుషోత్తం, ఎంపీటీసీ సుంకం నిర్మల-మల్లారెడ్డి,గ్రామ శాఖ అధ్యక్షుడు కూకట్ల నవీన్ యాదవ్ ఉన్నారు.