పెద్దపల్లి : నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్లు అందిస్తుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. మంగళవారం పాలకుర్తి మండలానికి చెందిన 970 మంది లబ్ధిదారులకు నూతన పెన్షన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ 57 ఏండ్లు నిండిన అర్హులందరికి పెన్షన్లు మంజూరు చేశారన్నారు. దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి పథకం లేదన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో అగ్రభాగాన దూసుకెళ్తుందన్నారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్కు మనం అండగా ఉండాలన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ అనసూర్య, పుట్నూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లం రాజయ్య, జడ్పీటీసీ సంధ్యారాణి, వైస్ ఎంపీపీ స్వామి, మేడిపల్లి పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్, పాలకుర్తి సర్పంచ్ జగన్ తదితరులు పాల్గొన్నారు.