పెద్దపల్లి జిల్లా : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరుల ఆశయాలను కొనసాగిద్దామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. సోమవారం హన్మకొండ నుంచి పెద్దపల్లి మీదుగా గోదావరిఖని వెళ్తున్న సందర్భంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద ఆయన నివాళులర్పించి నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ.. ఎన్నో ఆశయాలతో సాధించికున్న తెలంగాణను అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలుపరుస్తుందని చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమంతో బంగారు తెలంగాణను తయారుచేస్తున్న ప్రభుత్వానికి మనమంతా రుణపడి ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మైనార్టీ నాయకులు అల్లం నారాయణకు పూలబొకేలు అందజేసి శాలువాతో సత్కరించారు. జర్నలిస్టులు వేణుగోపాల్, మల్లేష్, తిరుపతి గౌడ్, శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.