పెద్దపల్లి : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి టీఆర్ఎస్ ప్రభుత్వంపై యువతలో విశ్వాసం పెరుగుతుందని జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు.
శుక్రవారం కాటారం, మహదేవ్ పూర్, మల్హర్, మహముత్తారం మండలాలకు చెందిన వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు.
వారికి మధుకర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ కు పతనం మొదలైందన్నారు. ఇన్నేండ్లు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పేదోడి ఆకలిని తీర్చడంలో విఫలం అయిందన్నారు. బహుజనుల పరిపాలన కోసం యువత నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు.