పెద్దపల్లి : జిల్లాలోని పెద్దపల్లి నియోజకవర్గంలో బీటీ రోడ్ల (గ్రామీణ) నిర్మాణం కోసం 25 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మంత్రి కేటీఆర్కు వినతి పత్రం అందజేశారు.
మంగళవారం హైదరాబాద్ ప్రగతిభవన్లో మంత్రిని కలిసి డీఎంఎఫ్టీ నిధుల నుంచి నియోజకవర్గంలో 13 బీటీ రోడ్ల (గ్రామీణ) నిర్మాణానికి రూ.25 కోట్లు మంజూరు చేయాలని, గ్రామాల మధ్య రోడ్డు సౌకర్యం లేక ప్రజలు వర్షాకాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రికి వివరించారు. కాగా, మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే వెంట ఎమ్మెల్సీ భానుప్రసాదరావు ఉన్నారు.