సుల్తానాబాద్ రూరల్, జూన్ 22: ఈసారి రుతుపవణాలు ముందే రావడంతో వర్షాలు వస్తాయని ఆశపడ్డ రైతన్నలు ముందస్తుగా పత్తి పంట సాగుకు సన్నద్ధమయ్యారు. దుక్కులు దున్ని పత్తి విత్తనాలు నాటి నెల రోజులు గడుస్తున్న వానలు ముఖం చాటేయడంతో రైతన్నలు ఆకాశం వైపు దీనంగా చూస్తున్నారు. అప్పులు చేసి దాదాపుగా ఎకరానికి రూ.10 వేల వరకు పెట్టుబడులు పెట్టారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అన్నదాతలు ఉన్నారు. కాలం కరుణించి వానరుడు జాలిపడి వర్షం పడితే రైతుల కళ్ళల్లో ఆనందం ఉంటుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ (Sulthanabad) మండలంలో సుమారు 780 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. వరి దాదాపుగా 15 వేల ఎకరాల వరకు పంటలు పండించే ప్రయత్నాలు చేస్తున్నారు. మొక్కజొన్న 20 ఎకరాలు పెట్టారు. కాగా, మండలంలోని మంచరామీలో 100 ఎకరాల విస్తీర్ణంలో రైతులు పత్తి సాగుచేస్తున్నారు. తొలకరి వానలు కురిసిన తర్వాత విత్తనాలు పెట్టారు. అయితే వర్షాలు రాకపోవడంతో, వాటిని కాపాడుకునేందుకు కాపాడుకునేందుకు బకెట్లు, బిందెలతో నీరు అందిస్తున్నారు.
ముందస్తు పత్తి సాగు చేశానని, ఇప్పుడు వర్షాలు రావడం లేదని శ్రీనివాస్ అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి విత్తనాలు నాటి నెల రోజులు అవుతుంది. పత్తి మొలకలు ఎండిపోతాయని భయమేస్తుంది. అందుకే బకెట్లు, బిందెలతో నీళ్లను పోస్తున్నాను. ఇలా అయినా కొద్ది రోజులు కాపాడుకోవచ్చు. వరుణదేవుడు కనుకరించి వర్షం వస్తే బాగుండు. నాకు 10 ఎకరాల 20 గుంటల వ్యవసాయ భూమి ఉంది. అందులో ఒక ఎకరం 20 గుంటలు పత్తి సాగు చేస్తున్నాను. విత్తనాలు కూడా నాటాను. విత్తనాలకు రూ. వేలు, దుక్కు దున్నే కూలి ఖర్చులు రూ.6 వేలు, పత్తి విత్తనాలు నాటిన కూలి ఖర్చులు రూపాయలు ఒక వెయ్యి, మొత్తం రూ.10వేల వరకు ఒక ఎకరానికి పత్తి సాగు ఖర్చవుతుంది. మరో 8 ఎకరాల 20 గుంటల లో వరి సాగు చేశా. మృగశిల పోయే ఇంకా వర్షాలు రావడం లేదా ఏ. ఇలా అయితే రైతులు పంటల సాగు చేసుకోవడం ఎలా. వరి కోత సమయంలో అకాల వర్షాలతో అప్పుడు రైతులకు నష్టం జరిగింది. ఇప్పుడైనా ముందస్తు వర్షాలు వస్తాయని పత్తి సాగు చేస్తే ఇప్పుడు ఈ పరిస్థితి ఉంది అని అన్నారు.