Peddapalli-Palakurthy | మంచిర్యాల అర్బన్, మార్చి 17: పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి కల్వర్ట్ను ఢీకొనడంతో దంపతులు దుర్మరణం చెందారు.
వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాలకు చెందిన లయన్స్ క్లబ్, క్రెడాయ్ సభ్యుడైన ఎడ్ల శ్రీనివాస్, రజిత దంపతుల కుమార్తె రిషిత హైదరాబాద్లో చదువుకుంటుంది. కూతుర్ని చూసేందుకు హైదరాబాద్ వెళ్లిన శ్రీనివాస్ దంపతులు సోమవారం రాత్రి మంచిర్యాలకు తిరుగుప్రయాణమయ్యారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ సమీపంలోకి వచ్చాక వారి కారు అదుపతప్పి కల్వర్ట్ను ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న దంపతులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు.