peddapally icds | పెద్దపల్లి రూరల్ ఏప్రిల్ 26: పిల్లలకు ఎదిగే దశలో చదువు జ్ఞానాన్ని అందిస్తుందని అందుకే వారికి చిన్నతనం నుంచే మంచి పౌష్టికరమైన ఆహారం అందించాలని ఎఫ్సీఐ మేనేజర్ వెంకటేష్ సాగర్ అన్నారు. జిల్లా కేంద్రమైన పెద్దపల్లి పట్టణంలోని శాంతి నగర్ అంగన్వాడీ కేంద్రాన్ని శుక్రవారం స్థానిక మాజీ కౌన్సిలర్, బీఆర్ఎస్ నాయకుడు లైశెట్టి భిక్షపతి, సంబంధిత అధికారులతో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పిల్లలకు ఇవ్వాల్సిన డైట్ ఆహారంతో పాటు సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పిల్లలకు పండ్లు, బ్రెడ్ బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్య క్రమంలో స్థానిక ఎఫ్సీఐ సిబ్బంది ఆకుల రాజేష్, అసిస్టెంట్ మేనేజర్
విష్ణు వర్ధన్, మహేందర్, సాయి కళ్యాణ్, తిరుపతితో పాటు లయన్స్ క్లబ్ ఆఫ్ చార్టర్ ప్రెసిడెంట్, మాజీ కౌన్సిలర్ లైశెట్టి భిక్షపతి, అంగన్వాడీ కేంద్రం టీచర్ అనితతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.