సుల్తానాబాద్ రూరల్ జూన్ 03 : పెద్దపల్లి జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మహిళల భద్రత, చైల్డ్ సేఫ్టీ, ఆన్లైన్ మోసాలు, యాంటీ డ్రగ్స్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా షీ టీమ్ మెంబర్ స్నేహలత మాట్లాడుతూ.. మహిళల రక్షణ కోసం ప్రతి రోజు బస్టాండ్, ప్రధాన చౌరస్తాలో జన సమీకరణ ప్రాంతాల్లో కాలేజీల వద్ద షీ టీం నిరంతరం గస్తీ నిర్వహిస్తారన్నారు.
ఎవరైనా వేధింపులకు గురి చేస్తే మహిళలు, విద్యార్థులు భయపడకుండా 6303923700 నంబర్ కు ఫోన్ చేసి సమస్య తెలపాలని కోరారు. ఫోన్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. అత్యాశకు పోయి ఆన్లైన్ మోసాలకు గురవుతున్నారని వాటికి జోలికి పోకుండా ఉండాలని అన్నారు. ఎవరైనా ఆన్లైన్ మోసాలకు గురైతే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి సమాచారం ఇవ్వాలని సూచించారు. మహిళలకు ఏదైనా ప్రమాదం ఉన్నట్లయితే, బెదిరింపులకు గురైతే వెంటనే 100/112 నంబర్ కు డయల్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ ఆసియా బేగం, ఫీల్డ్ ఆఫీసర్ లక్ష్మి, షీ టీమ్ సభ్యులు, సురేష్, మౌనిక, పాల్గొన్నారు.