పెద్దపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బట్టలు ఆరేసేందుకు వెళ్లి ఓ మహిళ కరెంట్ షాక్తో మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్ గ్రామ పంచాయతీ పరిధి పవర్ హౌస్ కాలనీ వద్ద చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం ఉదయం బట్టలు ఆరేసేందుకు వెళ్లిన ఎర్రోజు అనసూయ(48) అనే మహిళ విద్యుత్ షాక్ కు గురై మృతి చెందింది.
ఇనుప వైరుతో దండెం కట్టుకోగా బట్టలు ఆరేసేందుకు వెళ్లి విద్యుత్ షాక్ కు గురైనట్లు స్థానికులు తెలిపారు. అనసూయ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.