పెద్దపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి విద్యుత్ షాక్తో మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన ధర్మారం మండలం పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల తెలిపిన విరాలు ఇలా ఉన్నాయి.
గ్రామానికి చెందిన మడిపల్లి సత్తయ్య (45) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు విద్యుత్ శాఖ తగిలి దుర్మరణం చెందాడన్నారు. కాగా, మృతుడు ధర్మారం మండల కేంద్రంలో ఫుట్వేర్ షాప్ నడుపుతూ ఉపాధి పొందుతున్నాడు. సత్తయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.