పెద్దపల్లి, ఫిబ్రవరి 23: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పెద్దపల్లి – కునారం ఆర్వోబీ పనులను పూర్తి నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ సూచించారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డితో కలిసి కునారం ఆర్వోబీ పనులను పరిశీలించారు.
ఆర్వోబీ అందుబాటులోకి వస్తే ప్రజల ప్రయాణ, దూర భారం తగ్గి రవాణా సులభతరమవుతుందని తెలిపారు. ఆర్వోబీ ద్వారా పెద్దపల్లి జిల్లా నుంచి ఇతర జిల్లాలకు కనెక్టివిటీ పెరుగుతుందని చెప్పారు. ఆర్వోబీ నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించకుండా సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక్కడ పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొనుగోటి శ్రీనివాస్ రావు ఉన్నారు.