శంకరపట్నం, జూన్ 6 : ప్రజా సమస్యల పరిష్కారానికే గ్రామాల్లో పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టినట్లు డీపీవో వీరబుచ్చయ్య తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి శుక్రవారం రాత్రి శంకరపట్నం మండలం ధర్మారంలో పల్లె నిద్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన గ్రామసభలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
మంగళవారం ఉదయం గ్రామంలో తిరిగి సమస్యలను పరిశీలిస్తానని చెప్పారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి అంజనీ, ఎంపీడీవో జయశ్రీ, సర్పంచులు చుక్కల రవి, కాటం వెంకటరమణారెడ్డి, ఎంపీటీసీ మోతె భాగ్యలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి జీవిత, తదితరులు పాల్గొన్నారు.