32, 318 మంది రైతులు.. 216 లక్షల మెట్రిక్ టన్నులు
రూ. 206.99 కోట్ల చెల్లింపులు
81 సెంటర్లలో లక్ష్యం పూర్తి
మిగిలిన కేంద్రాల్లో చివరి దశకు
వెంటవెంటనే మిల్లులకు తరలింపు
రాజన్న సిరిసిల్ల, జూన్ 6 (నమస్తే తెలంగాణ): జిల్లావ్యాప్తంగా వేగంగా ధాన్యాన్ని కొనుగోలు ప్రక్రియ చేపట్టారు. యాసంగిలో 2.70లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. అందుకనుగుణంగా కార్యచరణ సిద్ధం చేసి అన్ని ఏర్పాట్లు చేశారు. ఎండతీవ్రత నేపథ్యంలో అన్ని కేంద్రాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించారు. అవసరం మేరకు కాంటాలు, తేమ శాతం పరీక్షించే యంత్రాలను అందుబాటులో ఉంచారు. తాగునీటి సౌకర్యం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కేంద్రాల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు.
రూ. 419.96 కోట్ల విలువైన వడ్ల సేకరణ..
ప్రతి పంట సీజన్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ రెండు మూడు నెలల వ్యవధి పడుతుంది. అం దుకు తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు చేస్తుంటా రు. యాసంగిలో మాత్రం వరి వేయవద్దని ముఖ్య మంత్రి కేసీఆర్ రైతాంగానికి విజ్ఞప్తి చేశా రు. అయినప్పటికి చాలా మంది రైతులు వరినే సాగుచేశా రు. సీఎం సూచన మేరకు చాలా మంది రైతులు ఇతర పంటలు వేసి సఫలీకృతులయ్యా రు. దీంతో వరి సాగు కొంత మేర తగ్గింది. ఈ సీజన్లో 2.70 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని జిల్లా మార్కెటింగ్శాఖ లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందు కోసం గత ఏప్రిల్ 28న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. మే రెండో వారం నుంచిపూర్తి స్థాయిలో 265 కేంద్రాలు తెరువగా, రెండు వారాల వ్యవధిలోనే రూ. 419.96 కోట్ల విలువ గల 215.960 లక్షల మెట్రిక్ టన్నుల ధా న్యం సేకరించి రికార్డు సృష్టించింది. ఈనెల 12 వరకు ఎంత వస్తే అంత కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నది. 265 కేంద్రాలలో 81 కేంద్రాలలో కొనుగోళ్లు పూర్తి చేసింది. 184 సెంటర్లలో ఆరు రోజుల్లో కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి చేసి, లక్ష్యా న్ని చేరుకునేందుకు చర్యలు తీసుకుంటున్నది.
ధాన్యం అమ్మిన రైతులు 32,318..
జిల్లాలో దాదాపు 1.30 లక్షల మంది రైతులకు పైగా ఉన్నారు. అందులో 80వేల వరకు వరి సా గు చేశారు. ప్రస్తుతం 265 కేంద్రాల్లో 32,318 మంది రైతుల నుంచి వడ్లను కొనుగోలు చేశారు. 26,308 మంది రైతుల వివరాలను ఆన్లైన్లో నిక్షిప్తం చేశారు. 17,099 మంది రైతులకు రూ. 206.99 కోట్లు చెల్లించింది. కాగా 9,209 మంది రైతులకు రూ. 104.86 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. ఈయాసంగిలో కేవలం మూడు నాలుగు రోజుల్లోనే ఖాతాల్లో డబ్బులు పడుతున్నందుకు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సర్కారుకు కృతజ్ఞతలు చెబుతున్నారు.
వెంట వెంటనే మిల్లులకు తరలింపు ..
రైతుల నుంచి సేకరించిన ధాన్యం బస్తాలను వెంట వెంట మిల్లులకు తరలిస్తున్నారు. జిల్లాలోని అన్ని ధాన్యం గోదాములు నిండిపోయాయి. ఇప్పటికే జిల్లాలోని 80 రైసుమిల్లులతో పాటు పెద్దపల్లి, కామారెడ్డి రైసు మిల్లులకు తరలించారు. ధాన్యం బస్తాలు లోడింగ్, ఆన్లోడింగ్ చేసేందుకు బిహార్, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల నుంచి కాంట్రాక్టర్లు హమాలీలను తెప్పించారు.
12లోగా లక్ష్యాన్ని పూర్తి చేస్తాం..
జిల్లాలో వేగంగా ధాన్యం సేకరణ పక్రియ చేపట్టాం. సేకరణ లక్ష్యం 2.70లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఇప్పటికే 215.960 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. విక్రయించిన రైతులకు మూడు నాలుగు రోజుల్లోనే డబ్బు లు వారి ఖాతాల్లో జమచేస్తున్నాం. ఈ నెల 12లోగా లక్ష్యాన్ని పూర్తిచేస్తాం.
– హరికృష్ణ, జిల్లా మార్కెటింగ్ మేనేజర్