వేములవాడ టౌన్ : వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామి వారి 18 రోజుల హుండీలను మంగళవారం లెక్కించగా రూ.65,43,895 ఆదాయం సమకూరినట్టు ఆలయ ఈవో డీ కృష్ణప్రసాద్ తెలిపారు.
నగదుతోపాటు 48 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారం, 3 కిలోల 900 గ్రాముల వెండి వచ్చిందన్నారు. బుధవారం కూడా హుండీ లెక్కింపు ఉంటుందని తెలిపారు.