Electricity | ముకరంపుర, జులై 21: యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ(టీజీ పీఈ జేఏసీ) ఆధ్వర్యంలో కరీంనగర్లో విద్యుత్ ఉద్యోగుల నిరసన మంగళవారం కొనసాగింది. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహించడంతో పాటు వర్షాన్ని లెక్క చెయకుండా ఎస్ఈ కార్యాలయం ముందు నిరసన తెలిపారు.
మంగళవారం నాటికి విద్యుత్ ఉద్యోగుల నిరసన పదకొండో రోజుకు చేరింది. ప్రభుత్వం ప్రైవేటీకరణను విరమించుకోవాలని, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమణారావు, మహేందర్ రావు, శ్రీనివాస్, రఘు, రాజు, సంపత్ కుమార్, రంగు వెంకటనారాయణ, నిఖిల్, విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు.