జగిత్యాల విద్యానగర్, ఫిబ్రవరి 23 : ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర సర్కారు, మున్సిపాలిటీల్లో ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటి వరకు పురుషులు, మహిళలకు కలిపి ఉండగా, ఇప్పుడు జగిత్యాలలో మహిళల కోసం ప్రత్యేకంగా ఓపెన్జిమ్ను ఏర్పాటు చేసింది.
18వ వార్డు స్వామి వివేకానంద మినీ స్టేడియంలో 12లక్షలతో నిర్మించింది. దీనిని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గురువారం ప్రారంభించి మాట్లాడారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, రోగం వచ్చిన తర్వాత కంటే రోగం రాకుండా చూసుకోవడమే ఉత్తమమార్గమన్నారు. దాని కోసం వ్యాయామం చేయడం ఉత్తమ మార్గమని సూచించారు. వ్యాయామం, ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజీలో 33 లక్షలతో వాకింగ్ ట్రాక్ నిర్మించామని, మినీ స్టేడియంలోని ఇండోర్ స్టేడియానికి 30లక్షల నిధులు మంజూరయ్యాయని, త్వరలో అందుబాటులోకి వస్తుందని చెప్పారు.