రాజన్నసిరిసిల్ల, మార్చి 30 (నమస్తే తెలంగాణ): ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్ర భుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. మనిషికి నయనం ప్రధానం కావడంతో కంటి జబ్బుల సమస్యలకు చెక్పెట్టేందుకు కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మంగా ప్రారంభించింది. ఇందు లో భాగంగా జిల్లా వ్యాప్తంగా 255 గ్రామ పంచాయతీల్లో ఉచిత కంటి క్యాంపులు నిర్వహిస్తున్నది. ప్రైవేటులో పరీక్షలు చేయించుకునే స్తోమత లేని పేదలకు పల్లె ముంగిట్లో ఉచిత కంటి పరీక్షలు చేయడమే కాకుండా, ఉచిత మందులు, ఖరీదైన అద్దాలు అందిస్తున్నందుకు ప్రజల్లో సంతోషం వ్యక్త మవుతున్నది. నైపుణ్య వైద్యుల సమక్షంలో అప్తోమెట్రిస్ట్లు కంటి పరీక్షలు చేస్తున్నారు.
1,62,576 మందికి పరీక్షలు
జిల్లాలో కంటి వెలుగు శిబిరాలు ప్రారంభించి 46 రోజులు కావస్తున్నది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లోని వివిధ గ్రామాల్లో నిర్వహించిన వైద్య శిబిరాల్లో 1,72,659 మం దికి కంటి పరీక్షలు చేశారు. 28,697 మందికి రీడింగ్ గ్లాసులు, 23,145 మందికి వివిధ రకాల పాయింట్ అద్దాలను పంపిణీ చేశారు. ప్రజల ముంగిట్లో కంటి వైద్య పరీక్షలు చేస్తున్నారు. ప్రతి రోజు 23 శిబిరాలలో 207 మంది వైద్య సిబ్బంది ప్రజలకు వైద్య సేవలందిస్తున్నారు. అందులో ఆప్తాల్మిక్ అసిస్టెంట్లు, ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు ఉన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. శిబిరాలకు వచ్చే వారి కోసం ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్య పరీక్షలు చేసి, అవసరమైన చుక్కమందులు, గోలీలు ఇస్తున్నారు. వివిధ రకాల పాయింట్ అద్దాల తయారీ కోసం హైదరాబాద్లోని పరిశ్రమలకు ఆర్డర్లు ఇస్తున్నా రు. రోజుకు 3వేలకు పైగా మంది వైద్య శిబిరాలకు వస్తున్నారు. ఉదయం 9గంటల నుంచి సా యం త్రం 4వరకు వైద్య శిబిరాలు నడుస్తున్నాయి. సర్కారు నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాలు పేదలకు వరంగా మారుతున్నాయి.
కళ్లు బాగా కనిపిస్తున్నయ్..
శాన్నాళ్ల నుంచి కళ్లు మసకమసకోలే కనిపిస్తున్నయ్. ఏది చూడాలన్న కనిపించక కళ్లు గుంజుతున్నయ్. దవఖాన్లకు పోవాలంటే మాఊరిలో లేదాయే. గవర్నమెంట్ పుణ్య మా అని మా ఊర్లనే క్యాంపు పెట్టిండ్రు. పరీక్షలు చేసి అద్దాలిచ్చిండ్రు. ఇప్పుడు బాగా కనిపిస్తున్నయ్. కేసీఆర్ సల్లంగుండాలే ఇలాంటి క్యాంపులు ఎప్పుడు పెడుతే మంచిగుంటది.
– ఈశ్వరయ్య కందికట్కూర్ (ఇల్లంతకుంట)
జీవితానికి వెలుగిచ్చిండు
మాది పల్లెటూరాయే. ఎటుపోవాలన్నా కళ్లు కనబడక ఎక్కడ ఏపురుగు పుసిఉందో తెలియక భయంతో బైటికి పోతలేను. నడిచే ఓపిక లేక కళ్ల దవఖానకు పోలేక ఇంట్లనే ఉంటున్న. ఊళ్ల కంటి పరీక్షలు సేత్తుండ్రని ఇంటికొచ్చి ఆయమ్మలు చెప్పిండ్రు. నిన్న పోయి పరీక్షలు చేసుకుంటే అద్దాలిచ్చిండ్రు. కేసీఆర్ సార్ జెయ్యవట్టి ఇప్పుడు మంచిగ కనపడుతున్నయ్. కళ్లలో ఏసుకునేందుకు సుక్కల మందు ఇచ్చిండ్రు.
– నర్సయ్య, కంది కట్కూర్(ఇల్లంతకుంట)
ఇంటి పనులు చేసుకుంటున్న
మొన్నటి దాక కండ్లు సరిగా కనిబడలె. ఇంట్లో బియ్యంలో రాళ్లు గూడ కనబడలె. కండ్ల దవఖానకు పోవాలంటే మండలానికో, సిరిసిల్లకో పోవాల్నాయే. చేతిలో పైసలు లేక అంత దూరం పోలేక ఎల్లదీసుకున్న. వారం రోజులనుంచి పల్లెలోనే క్యాంపు పెట్టిండ్రు. అందరు పోయి చూయించుకుంటే నేను పరీక్షలు చేయించుకున్నా. కండ్లద్దాలు ఇచ్చిండ్రు. ఇప్పుడు అన్ని పనులు చేసుకుంటున్నా. కేసీఆర్ సార్ జెయ్యవట్టి కండ్లు మంచిగయినయ్.
– రామవ్వ, కందికట్కూరు (ఇల్లంతకుంట)
మంచి అద్దాలిచ్చిండ్రు ..
ఈ వయసులో కండ్లు కనిపించక పోతే రందనిపించిం ది. కండ్లద్దాలు పెట్టుకుంటే చూపు మంచిగుంటదని చె ప్పిండ్రు. దగ్గరేమో దవఖాన లేదాయే. ఊళ్లే కంటి పరీక్షలు చేస్తుండ్రని డప్పు కొట్టి చెప్పిండ్రు. పాణం లేచొచ్చినట్లయింది. నిన్ననే పోయి పరీక్షలు చేయించుకుంటే మంచి అద్దాలిచ్చిండ్రు. చూపు బా గుంది. పెద్ద కొడుకు కేసీఆర్ వచ్చినంక మా లాంటి ముసలోళ్లకు అన్ని మంచిగ సేత్తుండు. నెలకు రెండు వెయ్యిలిస్తున్న దేవుడాయనే.
– లచ్చవ్వ, పెద్దలింగాపూర్(ఇల్లంతకుంట)