Blood Donation | కమాన్ చౌరస్తా, ఫిబ్రవరి 21 : తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఫర్ బాయ్స్, కరీంనగర్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఆరోగ్య శాఖ, కళాశాల ఎన్ఎస్ఎస్, ఎన్సిసి విభాగాల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ భవాని మాట్లాడుతూ రక్తదానం మహాదానం అని, ఒకరి రక్తం మరొకరి ప్రాణాన్ని కాపాడగలదన్నారు. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ శిబిరానికి మంచి స్పందన లభించిందని చెప్పారు. ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు మునుముందు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో ప్రేరణ నింపుతామని వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.