బోయినపల్లి, నవంబర్ 7: ‘ప్రస్తుత పరిస్థితుల్లో సహజసిద్ధమైన ప్రకృతి ఇచ్చిన పంటలు గానీ, పండ్లు గానీ లేవు. ఇలాంటి సమయంలో చిన్నారులకు పోషకాహారం అవసరం. విటమిన్లు కలిగిన పోషకాహారంతోనే ఆరోగ్యవంతమైన సమాజం తయారవుతుందని’ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. సోమవారం బోయినపల్లి మండలం కోరెం జడ్పీ పాఠశాలలో కర్ణాటక సత్యసాయి అన్నపూర్ణ ట్రస్టు ఆధ్వర్యంలో అల్పాహారం, రాగి జావ, మార్తండరావు మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో విద్యార్థులకు స్టీల్ గ్లాసుల పంపిణీ కార్యక్రమానికి హాజరై, మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వెన్ను దన్నుగా ఉంటున్న మార్తండ రావు మెమోరియల్ ట్రస్టు సేవలను, ట్రస్టు చైర్మన్ చెన్నాడి రాజ్యలక్ష్మిని ఆయన అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బెంగళూరులో సత్యసాయి అన్నపూర్ణ ట్రస్టు సభ్యులను కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహర సేవా కార్యక్రమాన్ని అమలు చేయాలని కోరడంతో ముందు కు వచ్చారని, చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని విద్యార్థులకు చక్కగా పౌష్టికాహారం అందించాలని కోరారు.
ఆధునిక జీవితంలో మనిషి ఆహార అలవాట్లు మారిపోయాయని, అంతర్లీనంగా ఉన్న ఆకలిని అన్నం ఒకటే తీర్చలేదన్నారు. మనిషి పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉండాలంటే 36 రకాల విటమిన్లు, మినరల్స్ శరీరానికి అవసరమని, అందుకు ఆకు కూరలు, రాగి జావ, పండ్లు తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. రాగి జా వతో చిన్నారుల్లో శక్తితోపాటు దేహధారుడ్యం పెరుగుతుందని చెప్పారు. ప్రాథమిక దశలో ఉ న్న విద్యార్థులు, చిన్నారులకు మైక్రో న్యూట్రిన్స్ తో పాటు, విటమిన్లు ఎంతో అవసరమని చెప్పా రు. ప్రస్తుత పరిస్థితిలో ఈ రోజుల్లో అందరి ఇండ్లలో మంచి ఆహారం తీసుకుంటున్నారని, కానీ విటమిన్లు కలిగిన ఆహారం తీసుకోవాలని సూచించారు. ఇక్కడ జడ్పీ చైర్పర్సన్ న్యాలకొం డ అరుణ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చెన్నాడి అమిత్కుమార్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ముదుగంటి సురేందర్రెడ్డి, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జడ్పీటీసీ కత్తెరపాక ఉమా కొండయ్య, ఏఎంసీ చైర్మన్ లెంకల సత్యనారాయణరెడ్డి, మండల రైతు బంధు సమితి కన్వీనర్ కొనుకటి లచ్చిరెడ్డి, వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, సింగిల్ విండో చైర్మన్ తీపిరెడ్డి కిషన్రెడ్డి, సర్పంచ్ చెన్నాడి రాజ్యలక్ష్మి, ఉప సర్పంచ్ గాజర్ల రోహిణి, ఎంపీటీసీ డబ్బు మమత, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, మాజీ ఎంపీపీలు సత్తినేని భాగ్యలత, సత్తినేని మాధవు ఉన్నారు.