Ganneruvaram | గన్నేరువరం, ఫిబ్రవరి 1 : రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చిందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంప వెంకన్న అన్నారు. కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చినందుకు నిరసనగా మండలకేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నాయకులు ఆదివారం రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యమ నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను అవమానించడం అంటే తెలంగాణ నేలను అవమానించడం అన్నారు.
రేవంత్ రెడ్డి పాలనను గాలికి వదిలేసి కక్ష రాజకీయాలతో టైం పాస్ చేస్తున్నారని మండిపడ్డారు. స్వరాష్ట్ర స్వప్నాన్ని సహకారం చేసి దశాబ్ద కాలం పాటు తెలంగాణను దేశంలో అగ్రగామిగా నిలిపిన మహానేత కేసిఆర్ అన్నారు. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు సిట్ పేరుతో నోటీసులు జారీ చేయడం రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలకు పరాకాష్ట అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యకురాలు నవీన, పుల్లెల లక్ష్మణ్, న్యాత సుధాకర్, ప్రభాకర్, మర్రి వెంకట మల్లు, శ్రీనివాస్, నూకల చింటూ, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.