Narayanpur | సుల్తానాబాద్ రూరల్, ఫిబ్రవరి 6 : సుల్తానాబాద్ మండలంలోని నారాయణపూర్ సమ్మక్క-సారలమ్మ జాతర హుండీని అధికారుల ఆధ్వర్యంలో శుక్రవారం లెక్కించారు. జనవరి 28 నుంచి 31 వరకు జరిగిన సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన హుండీల లెక్కింపు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
హుండీ ద్వారా రూ.4 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు, సమ్మక్క సారలమ్మ జాతర కమిటీ సభ్యులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గురుకుల సతీష్, ఈవో సదయ్య, ఏవో రాజశేఖర్, సమ్మక్క-సారలమ్మ జాతర కమిటీ చైర్మన్ పొలుసాని తిరుపతిరావు, ఉప సర్పంచ్ ఎర్రవెల్లి రామారావు, జాతర కమిటీ సభ్యులు. రాజేశం, కనకయ్య, సది, తిరుపతి, కనకయ్య, లక్ష్మణ్, రామారావు, గ్రామస్తులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.