Mallapur | మల్లాపూర్, జూన్ 15: తెలంగాణ రాష్ట్ర ఉపసర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడిగా మల్లాపూర్ మండలంలోని రేగుంట గ్రామ ఉపసర్పంచ్ గణవేని నందిని-మల్లేష్ యాదవ్ ను ఏకగ్రీవంగా ఎన్నిక చేస్తు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తీక్ సోమవారం హైదరాబాద్ లో నిర్వహించిన సమావేశంలో నియమాక పత్రం అందజేశారు.
అలాగే జగిత్యాల, ఆసిఫాబాద్ జిల్లాల ఇంచార్జీగా నియమించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ ఉపసర్పంచ్ల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని, తన ఎన్నికకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు.