పార్లమెంటులో నినదించిన ఎంపీ బోర్లకుంట
పోడియం ముందుకు దూసుకెళ్లి నిరసన
పెద్దపల్లి, జూలై 26(నమస్తే తెలంగాణ) : నిత్యావసర వస్తువుల, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని పెద్దపల్లి ఎంపీ డాక్టర్ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
ఈ మేరకు పార్లమెంటులో నినదిస్తూ పోడియం ముందుకు దూసుకెళ్లారు. బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినదించారు. సామాన్యులు నిత్యం వినియోగించే వస్తువులపై జీఎస్టీ వేసి భారం మోపి వారి నడ్డివిరుస్తున్నదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనైతిక, అప్రజాస్వామిక నిర్ణయాలను ఆయన ఎండగట్టారు.