కోల్సిటీ, ఏప్రిల్ 14: ‘రాజ్యాంగ నిర్మా త అంబేద్కర్ ఏ ఒక్క వర్గానికి చెందిన వ్యక్తి కాదు. ఆయన అందరివాడు. ఆయన పోరాట స్ఫూర్తితోనే లక్షలాది మందిని సమీకరించి 14 ఏండ్లపాటు పోరాడి కేసీఆర్ నాయకత్వం లో రాష్ర్టాన్ని సాధించుకున్నాం.’ అని పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. అంబేద్కర్ జ యంతి పురస్కరించుకొని రామగుండం ము న్సిపల్ కార్యాలయం టీ జంక్షన్ వద్ద నిర్వహించిన వేడుకల్లో స్థానిక మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో కలిసి పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం కొప్పుల మాట్లాడారు. బీ ఆర్ఎస్ హయాంలోనే ప్రపంచంలో నే అతిపెద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసి ఆయన్ను గౌరవించుకున్నామనీ, సచివాలయానికి బాబాసాహెబ్ పేరు పెట్టిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. బడుగు, బలహీనవర్గాలు, దళిత గిరిజన వర్గాల కోసం కేసీఆర్ ప్రభుత్వం అంబేద్కర్ అడుగుజాడల్లో నడిచిందన్నారు. రా జ్యాంగం ఇచ్చిన హక్కులతోనే దేశంలో ప్రతి పౌరుడు స్వేచ్ఛగా తిరుగగలుగుతున్నాడని, కానీ బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని తమకు అనుకూలంగా మార్చేందుకు కుట్ర చేస్తున్నదని దుయ్యబట్టారు.
రాజ్యాంగ పరిరక్షణ కో సం పోరాడేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ప్రధాన చౌరస్తాలోని పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మిర్యాల రాజిరెడ్డి, పెంట రాజేశ్, బొడ్డు రవీందర్, డా.వాసంపల్లి ఆనంద్బాబు, గడ్డి సరోజన, జేవి రాజు, మురళీధర్రావు, నూనె కొంర య్య, సీహెచ్ మొగిలి, దేవరాజ్, పర్లపల్లి రవి, తోడేటి శంకర్ గౌడ్, మారుతి, పిల్లి రమేశ్, బొడ్డుపల్లి శ్రీనివాస్, వడ్డెపల్లి శంకర్, నూతి తిరుపతి, అచ్చ వేణు, ఈదునూరి నర్సింగ్, నీరటి శ్రీనివాస్, చింటు, శ్రావణ్కుమార్ పాల్గొన్నారు.