తిమ్మాపూర్, జూన్7: స్వరాష్ట్రంలో సాగురంగంలో సర్కారు అద్భుతాలు సృష్టించిందని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఉద్ఘాటించారు. నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్లైన్తో ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించిన సీఎం కేసీఆర్, అధికారం చేపట్టి తెలంగాణను సస్యశ్యామం చేశారని కొనియాడారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం అల్గునూర్లోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన సాగునీటి దినోత్సవానికి ఆయన హాజరై మాట్లాడారు. మన నీళ్లు మనకే అనే నినాదం ఇస్తే..
ఆంధ్రా పాలకులు నవ్వుకున్నారని, కానీ రాష్ట్రం సాధించి మన నీళ్లు మనమే సద్వినియోగం చేసుకుని రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేసుకుని.. సాగునీటి విజయోత్సవ సభ నిర్వహిస్తామని కలలో కూడా అనుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ గోదావరి వద్ద కాళేశ్వరం నిర్మించి నదికే నడక నేర్పించారని ప్రశంసించారు. ఎక్కడో ఉన్న కాళేశ్వరం నీరు మానకొండూర్ నియోజకవర్గానికి అందడం గొప్ప విషయమని పేర్కొన్నారు. తోటపల్లి రిజర్వాయర్ ద్వారా నియోజకవర్గంలోని లక్షపైచిలుకు ఎకరాలకు నీళ్లందుతున్నాయన్నారు. నేడు తెలంగాణ దేశానికి అన్నం పెట్టే స్థాయికి చేరి అన్నపూర్ణగా భాసిల్లుతున్నదన్నారు.
చుక్క నీటిని వృథా చేయడంలేదు
డబ్బును బ్యాంకుల్లోని లాకర్లో పెట్టుకున్నట్టే.. మనం కాళేశ్వరం నీటిని మన గ్రామాల్లోని కుంటలు, చెరువుల్లో స్టోరేజీ చేసుకున్నామని చెప్పారు. ఎర్రటి ఎండకాలంలో సైతం కుంటలు నిండుకుండలా మారాయనానరు. భూగర్భజలాలు ఉబికివచ్చాయనానరు. నాడు వానల కోసం మొగులుకు ఎదురుచూసిన రైతు లు.. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందిలేకుండా రెం డు పంటలు పండించుకుంటున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ సాగునీటి రంగాన్ని బలోపేతం చేశారన్నారు. గురువారం నిర్వహించే గ్రామాల్లో చెరువుల పండుగను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉద్యమ సమయంలో సాగునీటి కోసం రాసిన పాటలను ఆలపించి ఆకట్టుకున్నారు.
జడ్పీ సీఈ వో ప్రియాంకకర్ణన్ మాట్లాడుతూ, కాళేశ్వరంతో రైతులు నిశ్చింతంగా రెండు పంటలు పండించుకుంటున్నారని చెప్పారు. తాను చదువుకున్న రోజుల్లో కరువుతో పడిన ఇబ్బందులను గుర్తుచేసు కున్నారు. తెలంగాణలో ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఎక్కడాకనపడడంలేదన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రత్యేకంగా రూపొందించిన వీడియో ఆల్బమ్ ను స్క్రీన్ ద్వారా ప్రదర్శించారు. అలాగే రాష్ట్రం లో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల గురించి ప్రత్యే క వీడియో ద్వారా వివరించారు. ఇరిగేషన్అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి వివరాలు, జిల్లా సాగు, ప్రభుత్వ ఉద్దేశాన్ని వివరించారు. ఇక్కడ ఈఈ పీ రమేశ్, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి అస్మత్ అలీ, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారు.