హుజూరాబాద్/హుజురాబాద్టౌన్/ జమ్మికుంట జనవరి19: ‘సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శమని.. ఇలాంటి బృహత్తర పథకాన్ని సమష్టిగా పని చేసి విజయవంతం చేద్దాం’ అని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ఉద్ఘాటించారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని కంటి పరీక్షలు చేయించుకోవాలని కోరారు. హుజూరాబాద్ బల్దియా పరిధిలోని బోర్నపల్లి, జమ్మికుంట పరిధిలోని ధర్మారం, ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాలను గురువారం ఆయన ప్రారంభించారు. అధికారులు, వైద్య సిబ్బందితో మాట్లాడి శిబిరాల నిర్వహణ తీరును తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి మాట్లాడుతూ, 18 ఏళ్లు నిండిన వారంతా పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు.
ప్రభుత్వం అంధత్వాన్ని దూరం చేసే లక్ష్యంతో గొప్ప కార్యక్రమాన్ని చేపడుతున్నదని చెప్పారు. అవసరం ఉన్న వారికి కళ్లద్దాలు పంపిణీ చేయాలని సూచించారు. ఆర్డీవో హరిసింగ్, స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్లు గందె రాధిక, తక్కెళ్లపల్లి రాజేశ్వర్రావు, వైస్ చైర్పర్సన్లు కొలిపాక నిర్మల-శ్రీనివాస్, దేశిని స్వప్నాకోటి, జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, తహసీల్దార్ కోమల్రెడ్డి, ఎంపీపీ ఇరుమల్ల రాణి, జడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి, కౌన్సిలర్లు రాజకొమురమ్మ, స్వరూప, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ చందు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సాజిద్, డిస్ట్రిక్ట్ హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్, ఆప్తమాలిక్ ఆఫీసర్ రఘోత్తమ్రెడ్డి, చెల్పూర్ పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ శ్యాం, ఎంపీహెచ్ఈవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.