జమ్మికుంట రూరల్, ఆగస్టు 3: రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణులు తప్పనిసరిగా తీసుకుని ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనివ్వాలని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయంలో బుధవారం తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా జమ్మికుంట1, 2, 3, 4, కేశాపూర్ 1, గణేశ్నగర్, మేదరివాడ, పిట్టలవాడ అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్రావు, వార్డు కౌన్సిలర్లతో కలిసి ఎమ్మెల్సీ హాజరయ్యారు. అనంతరం 16 మంది గర్భిణులకు పూలు, పండ్లను అందజేసి సీమంతాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానలో ఉచిత ప్రసవం, కేసీఆర్ కిట్ అందజేయడం హర్షణీయమన్నారు. ఇక్కడ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్నకోటి, కమిషనర్ సమ్మయ్య, కౌన్సిలర్లు, సీడీపీవో భాగ్యలక్ష్మి, వైద్యులు తులసీదాస్, లావణ్య, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తులు ఉన్నారు.