గంగాధర, ఆగస్టు 21: సీఎం కేసీఆరే తన దైవమని, కార్యకర్తలే తన బలం, బలగమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండోసారి పేరు ఖరారు కావడంపై బూరుగుపల్లిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2018లో సీఎం కేసీఆర్ మొదటి సారి అవకాశం ఇచ్చిన సమయంలో నియోజకవర్గంలోని కార్యకర్తలు కష్టపడి పనిచేశారని, ఇక్కడి ప్రజలు ఆదరించి 42 వేల ఓట్ల్ల మెజార్టీతో గెలిపించారని గుర్తు చేశారు. కొండగట్టు దేవస్థానాన్ని రూ.150 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని, మరో రూ.500 కోట్లు సైతం సీఎం కేసీఆర్ ప్రకటించినట్లు తెలిపారు. చొప్పదండి నియోజకవర్గ కేంద్రానికి 100 పడకల దవాఖాన మంజూరు చేయించామని, రూ.130 కోట్లతో సెంట్రల్ లైటింగ్, రోడ్లు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతి మండలంలో బ్రిడ్జిలు కట్టించామన్నారు. చొప్పదండి నియోజకవర్గాన్ని మరో కోనసీమగా మార్చామన్నారు.
సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో, మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, ఎంపీ సంతోష్కుమార్ సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. సమావేశంలో సింగిల్ విండో చైర్మన్లు వెలిచాల తిర్మల్రావు, మెన్నేని రాజనర్సింగరావు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు, మడ్లపెల్లి గంగాధర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాగి మహిపాల్రావు, కొండగట్టు దేవస్థానం బోర్డు డైరెక్టర్ ఉప్పుల గంగాధర్, సర్పంచ్ వేముల దామోదర్, నాయకులు కర్ర శ్రీనివాస్రెడ్డి, రేండ్ల శ్రీనివాస్, దూలం శంకర్గౌడ్, అట్ల శేఖర్రెడ్డి, గడ్డం స్వామి, సముద్రాల అజయ్, బీ కళ్యాణ్, సుంకె అనిల్, మామిడిపెల్లి అఖిల్, లంక హరిబాబు, తడగొండ అజేయ్, ఇరుగురాల రవి, గంగాధర శ్రీకాంత్ ఉన్నారు.