గంగాధర, అక్టోబర్ 26 : కాంగ్రెస్ను నమ్మి ఓట్లు వేసి అరిగోస పడుతున్నట్లు కర్ణాటక రాష్ట్ర రైతులు 200 మంది కొడంగల్, గద్వాల నియోజకవర్గాల్లో నిరసనలు తెలియజేస్తూ, ప్రజలకు వివరిస్తున్నారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు. అక్కడి ఆరు గ్యారెంటీలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని ఎద్దేవా చేశారు. ఈ మేరకు గురువారం రామడుగు మండలంలోని మోతె, గోలిరామయ్యపల్లి, కొరటపల్లి, షానగర్, పందికుంటపల్లి, కుర్మపల్లి, కిష్టాపూర్, సాయంత్రం గంగాధర మండలం కొండన్నపల్లి, కురిక్యాల గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. కొండన్నపల్లిలో సర్పంచ్ రేండ్ల జమున శ్రీనివాస్, కురిక్యాలలో సర్పంచ్ మేచినేని నవీన్రావు, కురిక్యాల సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిరుమలరావు ఎమ్మెల్యేను గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. రూ.1800 కోట్లతో చొప్పదండి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోను తప్పకుండా అమలు చేసి తీరుతారని, మాట ఇచ్చి మడత తిప్పని మహా నాయకుడు కేసీఆర్ అని స్పష్టం చేశారు.
ఎన్నికల సమయంలో వచ్చి అబద్ధపు ప్రచారాలు చేసే వారిని నమ్మి మోసపోవద్దని కోరారు. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే సీఎం కేసీఆర్ను మరచిపోవద్దని, చొప్పదండి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న తనను మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీరాం మధుకర్, జడ్పీటీసీ పుల్కం అనురాధ నర్సయ్య, సింగిల్ విండో చైర్మన్లు దూలం బాలగౌడ్, వెలిచాల తిర్మాల్రావు, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ పుల్కం గంగన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ లోకిని ఎల్లయ్య, వైస్ చైర్మన్ వేముల భాస్కర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్రావు, సర్పంచులు రేండ్ల జమున, మడ్లపెల్లి గంగాధర్, వేముల దామోదర్, జోగు లక్ష్మీరాజం, నాయకులు రామిడి సురేందర్, రేండ్ల శ్రీనివాస్, బొల్లాడి శ్రీనివాస్రెడ్డి, వేముల అంజి, తడిగొప్పుల రమేశ్, నిమ్మనవేని ప్రభాకర్, కడారి కనుకయ్య, సముద్రాల అజయ్, సుంకె అనిల్, మామాడిపల్లి అఖిల్, ఇరుగురాల రవి, గంగాధర శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.