జగిత్యాల, ఫిబ్రవరి 25 : జిల్లా కేంద్రంలోని పావని కంటి దవాఖాన, ఆపి, రోటరీ క్లబ్ జగిత్యాల ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గ, పరిసర ప్రాంతాలకు చెందిన నిరుపేదలకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ ఉచిత కంటి ఆపరేషన్లు చేశారు. సుమారు 19 మందికి కంటి శస్త్ర చికిత్సలు చేసి, ఉచిత మందులు, కండ్ల అద్దాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ్, ధరూర్ మాజీ సర్పంచ్ ప్రభాకర్, రాయికల్ మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ బరం మల్లేశ్, పట్టణ యూత్ ఉపాధ్యక్షుడు ఏనుగుల రాజు, దవాఖాన సిబ్బంది పాల్గొన్నారు.