జగిత్యాల, మే 21 : ధాన్యం సేకరణలో రైస్మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టవద్దని ఎమ్మెల్యే సంజయ్కుమార్ సూచించారు. చల్గల్ వ్యవసాయ మారెట్లో ప్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో మొ ట్టమొదట చల్గల్లో ధాన్యం కొనుగోలు కేం ద్రం ప్రారంభించామన్నారు. 10 రోజుల్లోగా కొ నుగోళ్లు పూర్తిచేయాలని సూచించారు. గతంతో పోల్చితే రాష్ట్రంలో 3 రెట్లు వరి సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. ధాన్యాన్ని తూర్పార బట్టి ఇస్తేనే కటింగ్ లేకుండా కొంటామని అంటే తన దృష్టికి తేవాలన్నారు. ప్రతి పక్షాల మాటలు ఫొటోలకే పరిమితమని, పని చేసే ప్రభుత్వం బీఆర్ఎస్ అని ఉద్ఘాటించారు. గతంలో ఎన్ని కొనుగోలు కేంద్రాలున్నాయో..?, ఇప్పుడెన్ని ఉన్నాయో..?,
అప్పటికీ, ఇప్పటికీ ధాన్యం ఎంత సేకరణ అయిందో ప్రతిపక్ష నాయకుడు జీవన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లర్లు ఇబ్బం ది పెడితే ప్రతి పక్షాలు మిల్లుల ఎదుట ధర్నా చేయాలని, కొనుగోలు కేంద్రాల వద్ద కాదని, రైతులను రెచ్చగొట్టడం సరికాదని హితవు పలికారు. 34 రోజుల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా కేంద్రాలు నడుస్తున్నాయని, అకాల వర్షాలతో కొంత ఇబ్బందైందని చెప్పారు. నకిలీ విత్తనాలు అమ్మితే తెలంగాణలో పీడీ యాక్ట్ అ మలు చేస్తున్నామన్నారు. రైతుల ముసుగులో రాజకీయాలు చేసే నాయకుల పట్ల అప్రమత్తం గా ఉండాలని కోరారు. బీఆ ర్ఎస్ రైతు పక్షపా తి అని, అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నదని చెప్పారు. ఇక్కడ ఏఎంసీ చైర్మ న్ నకల రాధ రవీందర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు బాల ముకుందం, ఏఎంసీ డైరెక్టర్ ఆనంద్ రావు, ఎంపీటీసీ దమ్మా మల్లారెడ్డి, ఉప సర్పంచ్ పద్మ తిరుపతి, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, చల్గల్ గ్రామశాఖ నాయకులు శ్రీనివాస్, మహిపాల్, గంగారాం పాల్గొన్నారు.