కార్పొరేషన్/తెలంగాణచౌక్/కమాన్చౌరస్తా/ముకరంపుర/మానకొండూర్/రూరల్/శంకరపట్నం, మే 5: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాలలో ఆదివారం నిర్వహించిన రోడ్ షోకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ వీణవంక నుంచి బస్సులో వెళ్లారు. కాగా, వీణవంక నుంచి జగిత్యాల వరకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. మంగళహారతి పట్టి, పూలు చల్లి కేసీఆర్కు జేజేలు పలికారు. కాగా, నగరంలోని కోతిరాంపూర్ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కమాన్చౌరస్తా, తెలంగాణ చౌక్, అంబేద్కర్చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూలు చల్లి స్వాగతం పలికారు.
వీరందరికీ కేసీఆర్ బస్సులోంచే అభివాదం చేస్తూ ముందుకు సాగారు. కార్యక్రమంలో మేయర్ యాదగిరి సునీల్రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు భావన, ఐలేందర్, గుగ్గిళ్ల జయశ్రీ, గందె మాధవి, తోట రాములు, వాల రమణారావు, రాజేందర్రావు, ఎదుర్ల రాజశేఖర్, బీఆర్ఎస్ నాయకులు పొన్నం అనిల్, మహేశ్, రమణ పాల్గొన్నారు.
మానకొండూర్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, రాష్ట్ర నాయకుడు గడ్డం నాగరాజు, జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్గౌడ్, ఊటూర్ పీఏసీఎస్ అధ్యక్షుడు ముద్దసాని ప్రదీప్రెడ్డి, నాయకులు గుర్రం కిరణ్గౌడ్, శాతరాజు యాదగిరి, ఎరుకల శ్రీనివాస్గౌడ్, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శంకరపట్నం మీదుగా వెళ్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. కేసీఆర్పై పూల వర్షం కురిపించారు. బస్సులోంచి కేసీఆర్తో పాటు కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.