కరీంనగర్ రూరల్, జనవరి 31: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజాప్రతినిధులు పని చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సూచించారు. కరీంనగర్ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మండలంలోని సర్పంచులను శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజల సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించాలన్నారు.
ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నవీన్కుమార్, ఎంపీడీవో దివ్యదర్శన్రావు, వైస్ ఎంపీపీ వేల్పుల నారాయణ, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బుర్ర తిరుపతి గౌడ్, సాయిల వినయ్సాగర్, వెంగళదాసు శ్రీనివాస్, ర్యాకం లక్ష్మి, గోలి రాజ్యలక్ష్మి, ఎల్కపల్లి స్వరూప, అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
కమాన్చౌరస్తా, జనవరి 31: ఈవెంట్ ఆర్గనైజర్లకు అండగా ఉంటామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నగరంలోని వైశ్యభవన్లో బుధవారం అసోసియేషన్ ఆవిర్భావ, కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వినియోగదారులకు మెరుగైన సేవలందించాలని సూచించారు. సభ్యులంతా ఐక్యంగా ఉంటూ అసోసియేషన్ అభివృద్ధికి తోడ్పడాలన్నారు.
అనంతరం సంఘం వ్యవస్థాపక అధ్యక్షులుగా గోగుల ప్రసాద్, ప్రవీణ్ సల్వాజి, అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా గౌరవేని బాబు, అభినవ్ కొత్తకొండ, తిప్పబత్తిని రవి, కోశాధికారిగా తమ్మిశెట్టి సంతోష్, ప్రోగ్రాం కన్వీనర్గా చిలువేరి శ్రీకాంత్, సహాయ, సంయుక్త కార్యదర్శులుగా మిర్యాల ఆనంద్, జేపీ, ప్రచార కార్యదర్శిగా తుమ్మల మధు, పట్టణ కార్యదర్శిగా మిమిక్రీ మహేశ్, యాక్షన్ కమిటీ సభ్యులుగా రేణికుంట అజయ్, శ్రీను, సాయికంఠ, మధు, గౌరవ సలహాదారులుగా సిద్ధి రమేశ్, యతిరాజు, నవీన్, సభ్యులుగా సునీత, శోభ, సాయిదీక్షిత్తో ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయించారు.