కరీంనగర్ కార్పొరేషన్, జనవరి 20 : వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందని ఎమ్మె ల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరీంనగర్ నియోజకవర్గంలో పొన్నం ప్రభాకర్ తర్వాత కాంగ్రెస్కు ఎక్కడా ఓటు బ్యాంకు రాలేదని, ఇక్కడ ఆ పార్టీ రెండుసార్లు గెలిచిన దాఖలాలు లేవన్నారు. గతంలో ఎమ్మెస్సార్ గెలిచినా, అది కూడా బీఆర్ఎస్ మద్దతుతోనేనని చెప్పారు. ఇప్పటివరకు కరీంనగర్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో కూడా తెలియదని ఎద్దేవా చేశారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 2014లో బీజేపీ మోదీ ప్రభావం ఉన్నా కరీంనగర్ ఎంపీగా వినోద్కుమార్ గెలిచారని గుర్తు చేశారు. ప్రజల అభీష్టం మేరకు ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం తమకు లేదన్నారు. ప్రజా తీర్పును శిరసావహిస్తామని, గౌరవిస్తామని చెప్పారు. ప్రజలు తమకు ప్రతిపక్షం పాత్ర ఇచ్చారని, సమర్థవంతంగా పనిచేస్తామని వివరించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ కాం గ్రెస్ నెరవేర్చేదాకా పోరాడుతామన్నారు. 1999లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, ఆరు నెలల్లోనే వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పటి టీడీపీ ఓడిపోయిందని గుర్తు చేశారు.
అప్పుడు చంద్రబా బు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించడం వల్లే ప్రజ లు ఇతర పార్టీలకు అవకాశం ఇచ్చారన్నారు. ఇప్పుడు కూడా ప్రభుత్వ పనితీరును అనుసరించే తీర్పు ఇస్తారని తెలిపారు. కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో ఎక్కడా అవిశ్వాసం వచ్చే అవకాశమే లేదని, ఒకవేళ కార్పొరేషన్లో పెట్టాలంటే 45 మంది కార్పొరేటర్ల మద్దతు అవసరమన్నారు. అది జరిగే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 45 రోజులవుతున్నదని, కరీంనగర్లో ఎక్కడికక్కడ అభివృద్ధి నిలిచిపోయిందని మండిపడ్డారు.
కరీంనగర్లోని వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల విషయం లో రాజకీయాలు అవసరం లేదన్నారు. ప్రభుత్వం నుంచి చేస్తామంటే తాము స్వాగతిస్తామని తెలిపారు. వీటితో పాటు ఇతర ఆలయాల్లో నూ అభివృద్ధి పనులు, కార్యక్రమాలు చేపట్టాలన్నారు. తాము తీసుకువచ్చిన మానేరు రివర్ ఫ్రంట్, రేకుర్తి నరసింహస్వామి ఆల య అభివృద్ధి పనులను పూర్తి చేయాలన్నా రు. భూకబ్జాల విషయంలో ఎవరైనా తప్పుచేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని తెలిపారు.
తప్పు చేస్తే తప్పకుండా చట్టపరంగా శిక్ష అనుభవిస్తారని స్పష్టం చేశారు. ఆదివారం కరీంనగర్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. ఈ నెల 24న పార్లమెంట్ స్థాయి సోషల్ మీడి యా సమావేశం ఏర్పాటు చేసుకొని పార్టీ కా ర్యకర్తల్లో జోష్ తీసుకువస్తామని, ఈ మీటింగ్కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారని పేర్కొన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని స్వాగతిస్తామన్నారు. దేవుడి కార్యక్రమాన్ని ఎక్కడా రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదన్నారు.