కోరుట్ల, డిసెంబర్ 6: రాజ్యాంగాన్ని రచించి అన్నివర్గాలకు హక్కులు ప్రసాదించిన అంబేద్కర్ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ఉద్బోధించారు. కోరుట్ల కొత్త బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్నగర్లో 67వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనం గా నిర్వహించారు. ఎమ్మెల్యే హాజరై రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశంలోని బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పరితపించిన గొప్ప త్యాగశీలి అంబేద్కర్ అని కొనియాడారు.
జీవితం తాత్కాలికమని, రాజ్యాంగం శాశ్వతమన్న అంబేద్కర్ దేశ ప్రజల కోసం రాజ్యంగాన్ని రచించి ప్రజాస్వామ ఫలాలను పేదలకు పంచిన మహనీయుడన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటిసారి కోరుట్లలో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఘ నంగా సత్కరించారు. ఈసందర్భంగా సంజయ్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఎమ్మెల్యేగా గెలిపించిన కోరుట్ల నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని, అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో మున్సిపల్ ఉపాధ్యక్షుడు గడ్డమీది పవన్, కమిషనర్ రాజేశ్వర్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్, కౌన్సిలర్లు మోర్తాడు లక్ష్మీనారాయ ణ, బలిజ పద్మా రాజారెడ్డి, బద్ది సుజాతా మురళి, గంధం గంగాధర్, పేర్ల సత్యం, గుండోజి శ్రీనివా స్, జిందం లక్ష్మీనారాయణ, అన్వర్, సజ్జు, అంబేదర్ విగ్రహ కమిటీ అధ్యక్షుడు ఉయ్యాల నర్స య్య, ఆలిండియా అంబేదర్ సంఘం డివిజన్ అధ్యక్షుడు ఉయ్యాల శోభన్, బీఆర్ఎస్ నేతలు పుప్పాల ప్రభాకర్,ఆడెపు మధు, బాబా, రహీం, దాసరి రాజశేఖర్, మురళి, అంబేదర్ మాల, మాదిగ యువజన సంఘాల అధ్యక్షులు కంబ ఆనంద్, బలంతుల సురేశ్ పాల్గొన్నారు.