మెట్పల్లి, ఫిబ్రవరి 6 : ఓట్ల కోసం వచ్చే కాంగ్రెసోళ్లను ఎన్నిక ల హామీల అమలుపై నిలదీయాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సం జయ్ కల్వకుంట్ల ఓటర్లకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి శూన్యం అని పేర్కొన్నారు. మెట్పల్లి పట్టణంలోని ఇందిరానగర్, వెంకట్రావుపేట్లో బీఆర్ఎస్ అభ్యర్థులు బర్ల రమేశ్, కొమిరెడ్డి శ్రీనివాస్, ద్యావతి అరుణ తరఫున శుక్రవారం ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లకు ఆయన హాజరై మాట్లాడారు.
బీఆర్ఎస్ హయాంలోనే మెట్పల్లి పట్టణం అభివృద్ధి చెందినట్లు తెలిపారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధిలో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత కేసీఆర్దేనని కొనియాడారు. కాంగ్రెస్ పాలనలో ఒక్క అభివృద్ధి పనీ చేపట్టలేదని విమర్శించారు. ప్రజా సంక్షే మం, అభివృద్ధి కోసం పాటుపడే బీఆర్ఎస్కు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.