Mission Bhagiratha | తిమ్మాపూర్, జూలై 9 : యంత్రాల మరమ్మతుల కారణంగా కరీంనగర్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో రెండు రోజుల పాటు తాగునీటి సరాఫరాలో అంతరాయం కలగనున్నట్లు మిషన్ భగీరథ ఈఈ రాము తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీలో గల మిషన్ భగీరథ ప్రాజెక్ట్ ఇంటెక్ వెల్లో వరంగల్కు నీటిని సరాఫరా చేసే యంత్రాల మరమ్మతుల పనుల కారణంగా ఈ నెల 10 శనివారం నుండి 12న ఆదివారం సాయంత్రం 7గంటల వరకు హుజూరాబాద్, హుస్నాబాద్, మానకొండూర్ నియోజకవర్గాల్లోని అన్ని మండలాలు, మున్సిపాలిటీలలో మిషన్ భగీరథ తాగునీటి సరాఫరాకు అంతరాయం కలగనున్నట్లు మిషన్ భగీరథ ఈఈ తెలిపారు. ప్రజలు రెండు రోజులకు సరిపడా నీటిని ముందుగానే నిల్వ ఉంచుకోవాలని సూచించారు. తాత్కాలికంగా ప్రత్యామ్నాయ మార్గాలు ద్వారా సర్దుకుని, సహకరించాలని కోరారు.