కరీంనగర్, మార్చి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ నెల 18, 19 తేదీల్లో అకాల వర్షాలు విరుచకపడ్డాయి. ఈదురు గాలులతో భారీగా వడగళ్ల వాన పడడం వల్ల పెద్ద మొత్తంలో పంటలు దెబ్బతిన్నాయి. సాధారణంగా మే నెలలో అకాల వర్షాలు వస్తాయి. కానీ, ఈసారి వాతావరణంలో మార్పుల కారణంగా ఇప్పుడే పడడం వల్ల రైతులకు అపార నష్టం వాటిల్లింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు నిండుగా ఉండడమే కాకుండా.. పెరిగిన భూగర్భజలాల వల్ల వివిధరకాల పంటల సాగుతో విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో అకాల వర్షాల వల్ల నష్టం భారీగా జరిగింది.
జగిత్యాల జిల్లాలో మంగళవారం మధ్యా హ్నం వరకు సేరించిన వివరాలు ప్రకారం.. 33 శాతానికి మించి అంటే 1470 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అందులో వరి 135, వేరుశెనగ 172, నువ్వులు 96 ఎకరాల్లో దెబ్బతినగా, 10 82 మంది రైతులకు నష్టం వాటిల్లింది. 33 శాతం కంటే తక్కువగా 834 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు నివేదికలు ఇచ్చారు. మామిడికి సం బంధించి 33 శాతం కన్న తక్కువగా 1842 హెక్టార్లలో పంట దెబ్బతినగా 2446 మంది రైతులు నష్టపోయారు. దీని విలువ సుమారు రూ.9.21 కోట్లు ఉంటుంది. అలాగే, 33 శాతానికి పైగా చూ స్తే 192 హెక్టార్లలో మామిడి దెబ్బతినగా 345 మంది రైతులు నష్టపోయారు. దీంతో రూ.16.8 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు.
కరీంనగర్ జిల్లాలో 14,287 మంది రైతులకు చెందిన 23,116 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అందులో గంగాధరలో వరి 4,275, మామిడి 460, ఇతర ఉద్యాన పం టలు 20 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. రామడుగు మండలంలో వరి 4,981, మక్క 199, మామిడి 590, వాటర్ మిలన్ 20, ఇతర ఉద్యాన పంట లు 35 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. చొప్పదండి మండలంలో వరి 2,153, మక్క 316, మా మిడి 500, వాటర్ మిలన్ 100, ఇతర ఉద్యాన పంట లు 50 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. మానకొండూర్లో మక్క 250, ఎకరాల్లో దెబ్బతిన్నది. తిమ్మాపూర్లో మక్క 171 ఎకరాల్లో, శంకరపట్నంలో మక్క 85 ఎకరాల్లో, చిగురుమామిడి 103, గన్నేరువరం 316, హు జూరాబాద్లో వరి 21, మక్క 91, జమ్మికుంటలో మ క్క 1,430 ఇల్లందకుంట లో 1,837, ఎకరాల్లో వీణవంకలో వరి 1,873, మక్క 2,681, మామిడి 69 ఇత ర ఉద్యాన పంటలు 7 ఎకాల్లో దెబ్బతిన్నాయి. సైదాపూర్లో వరి 74, మక్క 409 ఎకరాల్లో దెబ్బతిన్నది.
పెద్దపల్లి జిల్లాలో పాక్షికంతోపాటు 33 శాతం కంటే ఎక్కువగా 7174 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. తద్వారా 4079 మంది రైతులు నష్టపోయారు. 52 గ్రామాల్లో 2, 411 రైతులకు చెందిన 6161.2 ఎకరాల్లో వరి, అలాగే 29 గ్రామాల్లోని 1168 మంది రైతులకు చెందిన 2013 ఎకరాల్లో మక్క దెబ్బతిన్నట్టు వ్యవసాయాధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 76.19 హెక్టార్లలో పం ట దెబ్బతినగా 165 మంది రైతులకు నష్టం వాటిల్లింది. జిల్లాలోని రుద్రంగి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, తంగళ్లపల్లి, ఇల్లంతకుంట, బో యినపల్లి మండలాల్లో పంట నష్టం జరిగినట్లుగా అధికారులు గుర్తించారు.
పటిష్టమైన చర్యలు
వర్షాలతో పంటల నష్టాన్ని ఎప్పటికప్పుడు గమనించిన సీఎం కేసీఆర్ మూ డు రోజుల క్రితమే కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలు తయారు చేయాలని ఆదేశించారు. దీంతో ఉమ్మడి జిల్లా మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్తోపా టు ఎమ్మెల్యేలు.. దెబ్బతిన్న పంటల వివరాల నివేదికను యుద్ధప్రాతిపదికన తయారు చేయాలని సంబంధిత వ్యవసాయ శాఖను ఆదేశించారు. దీంతో అధికారులు గడిచిన రెండు రోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. గ్రామ, మండల, డివిజన్ వారీగా అందులో పంటల వారీగా వివరాలు సేకరిస్తున్నారు. నష్టపోయిన ఏ రైతు కూ అన్యాయం జరగకుండా సర్వే చేయాలన్న స్పష్టమైన ఆదేశాల నేపథ్యంలో ఫీల్డ్ మీదకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే ఒక ప్రాథమిక నివేదికను ఇచ్చిన అధికారులు.. బుధవారం సాయంత్రంలోగా సమగ్ర నివేదికను ఇచ్చేందుకు కావాల్సిన పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ సారి మరితం పకడ్బందీగా వివరాలు సేకరిస్తున్నారు. నష్టపోయిన ఏ ఒక్క రైతు పేరు నివేదికలో మిస్ కాకుండా ఉండేలా ఒకటి రెండు సార్లు గ్రామాల వారీగా పరిశీలన చేసి నివేదికలు తయారు చేస్తున్నారు.
అండగా ప్రభుత్వం
అనుకోని వర్షాల వల్ల అపారంగా నష్టపోయిన రైతులను అన్ని రకాలుగా అదుకునే దిశగా ప్రభు త్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నది. వ్యవసాయశాఖ అధికారులు ఇచ్చే నివేదికల అధారం గా సదరు రైతులకు పరిహారం అందించేందుకు సన్నాహాలు చేస్తున్నది. మం గళవారం చొప్పదండి మండలం మంగళపల్లి, రామడుగు మండలంలోని దత్తోజిపేట, లక్ష్మీపూర్ గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వి నోద్కుమార్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కలెక్టర్ కర్ణన్ పరిశీలించారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని, సీఎం కేసీఆర్ అండ గా నిలుస్తారని భరోసా కల్పించారు. ప్రాజెక్టులు కట్టి ఆ నీళ్లతో పంటలు పండిస్తుంటే.. వడగండ్ల వాన అందరికీ బాధ ను మిగిల్చిందంటూ రైతుల కు వివరించారు. అకాల వర్షాలకు పంటలు కో ల్పోయిన అన్నదాతలు బాధపడవద్దని, సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని, ఆదుకుంటారని స్పష్టం చేయడంతో రైతుల్లో భరోసా కనిపించింది.