కొత్తపల్లి, జనవరి 27 : ప్రభుత్వోద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించడంలో తాను ఎప్పుడూ ముందుంటానని రాష్ట్ర రవా ణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో ఫంక్షన్హాల్ శనివారం రాత్రి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీఎన్జీవోస్ 2024 డైరీ ఆవిష్కరించి మాట్లాడారు. ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
ఉద్యోగులు ఎదుర్కొంటున్న జోనల్ సమస్య, జిల్లాల విభజన, 317 జీవో ఇతర సమస్యలపై సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. టీఎన్జీవోస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, టీఎన్జీవోస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీవో మహేశ్వర్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, టీఎన్జీవోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగెం లక్ష్మణ్రావు తదితరులు పాల్గొన్నారు.