Minister Laxman Kumar | ధర్మారం, మార్చి 22: ధర్మారం మండలం కొత్తూరు గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన పెద్దమ్మ తల్లి పట్నాల ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు డప్పు చప్పులతో మంత్రికి స్వాగతం పలికారు.
అనంతరం లక్ష్మణ్ కుమార్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పెద్దమ్మ గుడి మండప నిర్మాణానికి రూ.15 లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు. ఈ ఉత్సవంలో ముదిరాజ్ సంఘం కుల పెద్దలు, సర్పంచ్ భూక్య సంగీత, ఉప సర్పంచ్ సామల భూషణం, వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్ తాళ్ల మల్లేశం, మాజీ ఎంపీపీ కొడారి హనుమయ్య, డీసీసీ కార్యదర్శి కొత్త నర్సింహం, గ్రామ శాఖ పార్టీ అధ్యక్షుడు కాంపల్లి పోచయ్య, పార్టీ నాయకుడు చింతల ప్రదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.