రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి27,(నమస్తే తెలంగాణ)/ ఎల్లారెడ్డిపేట/ సిరిసిల్లరూరల్ : రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాల్లో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ముస్తాబాద్ మండలం మోహినికుంటలో తమ బంధువులైన కల్వకుంట్ల చక్రధర్రావు కుటుంబా న్ని పరామర్శిస్తారు. 11:30 గంటలకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు అక్కడే వృద్ధుల డే కేర్ సెంటర్కు ప్రారంభోత్సవం చేయనున్నారు. మధ్యా హ్నం ఒంటి గంటకు రాచర్ల గొల్లపల్లిలో ఎల్లమ్మ సిద్దోహానికి హాజరవుతారు. అనంతరం రాచర్ల గొల్లపల్లిలో రైతు వేదిక, మధ్యాహ్నం 2 గంటలకు రాచర్ల బొప్పాపూర్, మూడు గంటలకు వెంకటాపూర్లో నూతన గ్రామపంచాయతీ భవనాలకు ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం సాయం త్రం 4 గంటలకు మండేపల్లిలో కేసీఆర్ నగర్లో ఇండ్ల పట్టాల పంపిణీ చేయనున్నారు.
ఆత్మగౌరవ పంచాయతీలు రెడీ
దశాబ్దాలుగా శిథిలావస్థలో, అరకొర వసతుల మ ధ్య మగ్గిన పంచాయతీలకు ఆధునిక పాలనా భవనాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే రాజసౌధా న్ని తలిపించేలా పలు గ్రామాల్లో భవనాలు నిర్మిం చి ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా రూ.24లక్షలతో వెంకటాపూర్, రూ.40 లక్షలతో బొప్పాపూర్, రూ.24 లక్షలతో రాగట్లపల్లి పంచాయతీ భవనాలు నిర్మించగా, ప్రారంభోత్సవానికి ముస్తాబయ్యాయి. భవనాలను ఆధునిక హంగులతో నిర్మించామని, సకల వసతులు కల్పించామని, నేడు మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నట్లు డీఈ శ్రీనివాస్ తెలిపారు.
విద్యార్థులకు ఆధునిక విద్య
కాలేజీ విద్యార్థులు ఆకాశమే హద్దుగా ఎదిగేలా.. మారుతున్న కాలానికనుగుణంగా సాంకేతిక విద్యను అందిపుచ్చుకునేలా మంత్రి కేటీఆర్ అభయమిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేస్తున్నారు. ఇది వరకే సిరిసిల్ల పరిసర కాలేజీల విద్యార్థులకు పంపిణీ చేశా రు. మంగళవారం వీర్నపల్లి, ముస్తాబాద్, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, తంగళ్లపల్లి, బోయినపల్లి మండలాల్లోని సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ప్రభుత్వ జూనియర్, కస్తూర్బా, మోడల్స్కూల్, జ్యోతిబాపులే జూ నియర్ కళాశాలల విద్యార్థులు 2111 మందికి ఎల్లారెడ్డిపేటలోని జూనియర్ కాలేజీ వేదికగా పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం భారీ సభావేదిక, విద్యార్థులు కూర్చునేందుకు గ్యాలరీలను ఏర్పాటు చేశారు. అలాగే ఆవరణలో రూ.80లక్షలతో స్టేడియం నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
డబుల్ లబ్ధిదారులకు పట్టాల పంపిణీ
తంగళ్లపల్లి మండలం మండెపల్లి శివారులోని డబుల్బెడ్ రూం ఇండ్ల సముదాయంలో ఇండ్లు పొందిన లబ్ధిదారులకు మంత్రి కేటీఆర్ పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఇక్కడ సిరిసిల్ల పట్టణ వాసుల కోసం 1270, మండెపల్లి వాసుల కోసం 60 డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి, కేసీఆర్నగర్గా నామకరణం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే పట్టణానికి సంబంధించి లబ్ధిదారులకు దశల వారీగా పట్టాలు పంపిణీ చేస్తున్నారు. మంగళవారం మూడో విడతగా 400 మందికి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో అమాత్యుడి చేతులమీదుగా పట్టా లు ఇవ్వనుండగా, వీటితో పంపిణీ సంపూర్ణం కానుంది.
పకడ్బందీ ఏర్పాట్లు
కేటీఆర్ టూర్ సందర్భంగా ఎల్లారెడ్డిపేటలోఅధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయగా, సోమవారం కలెక్టర్ అనురాగ్జయంతితో పాటు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పరిశీలించారు. గ్రామ పంచాయతీలు, డే కేర్ సెంటర్, కాలేజీ మైదానంలోని సభావేదికను పరిశీలించారు. ట్యాబ్ల పంపిణీ సందర్భంగా ఇబ్బందులు రా కుండా అధికారులను అప్రమత్తం చేశారు. ఇక్కడ గీవ్ తెలంగాణ ఫౌండేషన్ ప్రతినిధి కొండూరి సాంకేత్ రావు, జాయింట్ కలెక్టర్ ఖీమ్యానాయక్, జడ్పీటీసీ చీటి లక్ష్మణ్రావు, సెస్ డైరెక్టర్ కృష్ణహరి, సర్పంచ్ వెంకట్రెడ్డి, తహసీల్దారు జయంత్కుమార్, ఎంపీడీవో చిరంజీవి ఉన్నారు.