చొప్పదండి, జూన్ 5: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు దేవస్థానానికి ఈ నెల 21న రానున్న మంత్రి కేటీఆర్ పర్యటనను ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం కరీంనగర్లోని ఆయన నివాసంలో చొప్పదండి నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులతో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజవర్గంలోని ఆరు మండలాల నుంచి ప్రజా ప్రతినిధులు నాయకులు పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. నాయకులు పాల్గొన్నారు.
వినోద్కుమార్ను కలిసిన నాయకులు
గంగాధర, జూన్ 5 : రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ను కరీంనగర్లోని ఆయన కార్యాలయంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మండల నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బూరుగుపల్లిలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఆహ్వానించినట్లు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాగి మహిపాల్రావు తెలిపారు. ఇక్కడ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వర్రావు, మండలాధ్యక్షుడు మేచినేని నవీన్రావు, సర్పంచ్ వేముల దామోదర్, నాయకుడు మ్యాక వినోద్ ఉన్నారు.
తెలంగాణచౌక్, జూన్ 5: రాష్ట్ర ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ను నగరంలోని క్యాంపు కార్యాలయంలో భగత్ నగర్ యాదవ సంఘం నాయకురాలు సందవేన గీతాంజలి, నాయకులు సీహెచ్, రాములు, బీ రాములు, మైనార్టీ నాయకురాలు ఫైమదా బేగం సోమవారం కలిసి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ నెల 9న రెండో విడుత గొర్రెల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయిండంతోపాటు మైనార్టీలకు అందిస్తున్న సంక్షేమ పథకాలపై వినోద్కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు.
కొత్తపల్లి, జూన్ 5 : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ను కరీంనగర్లోని కార్యాలయంలో సోమవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర సాధనతో పాటు తెలంగాణ అభివృద్ధిలో వినోద్కుమార్ క్రీయాశీల పాత్ర పోషించారని గుర్తు చేశారు. కరీంనగర్కు స్మార్ట్ సిటీ హోదా, పలు కేంద్ర ప్రాజెక్టులను సాధించడంలో సీఎం కేసీఆర్తో కలిసి ఎనలేని కృషిచేశారన్నారు. ఇక్కడ షేక్ యూసుఫ్, సుప్రీమ్ జావీద్, కిమ్ఫహాద్, ఇస్థిక్ అహ్మద్, ఉమేజార్, జక్కుల నాగరాజు, సంపత్ తదితరులు ఉన్నారు.