కరీంనగర్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో గెలుపే లక్ష్యం గా గులాబీ దండు వీర సైనికుల్లా ముందుకు కదలాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, వృద్ధులు, మై నార్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. కరీంనగర్లోని పీవీఆర్ ప్లాజా ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన మం థని నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమానికి మంథని ని యోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, భూపాలపల్లి జడ్పీ చైర్పర్సన్ జకు శ్రీహర్షిణీ రాకేశ్తో కలిసి మంత్రి పాల్గొని మాట్లాడారు. రెండు రోజుల శిక్షణ నేపథ్యంలో నియోజకవర్గం నుంచి పెద్దఎత్తున కా ర్యకర్తలు తరలిరావడం సంతోషంగా ఉందన్నా రు. ఒక పట్టుదలతో కార్యకర్తలు రావడాన్ని చూస్తుంటే ఈ సారి మంథని గడ్డపై గులాబీ జెండా ఎగురడం ఖాయంగా కనిపిస్తున్నదన్నా రు. ఇకడికి వచ్చిన ప్రతి కార్యకర్త తానే ఎంపీ పీ, జడ్పీటీసీ, ఏఎంసీ చైర్మన్, పీఏసీఎస్ చైర్మన్ అనుకుని ముందుకు సాగాలన్నారు. ఒకో కార్యకర్త మరో వంద మందిని తయారు చేయాలని సూచించారు.
నియోజకవర్గంలో జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ చేస్తున్న అభివృద్ధి, సేవా కార్యక్రమాలతోపాటు ఆయనలో ఉన్న పట్టుదల, తపనను చూసిన సీఎం కేసీఆర్ గొప్పగా ఆలోచన చేసి మళ్లీ ఆయననే ప్రమోట్ చేశారని వివరించారు. తొమ్మిదేండ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, అన్నివర్గాలకు లబ్ధి జరిగేలా ఆలోచన చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందాలంటే అకడ మన నాయకుడు ఉండాలని, ఇతర పార్టీల నాయకులు ఉంటే మన ప్రయోజనం జరుగదనే విషయా న్ని గుర్తించాలన్నారు. పేరుకే ఎమ్మెల్యేగా ఉంటారే తప్ప వాళ్లతో ఏమీ జరుగదన్నారు. నియోజకవర్గంలో ఏమి జరగాలన్నా, ఎవరికి సాయం కావాలన్నా పుట్ట మధుతోనే సాధ్యమవుతుందన్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ బంధు పుట్ట మధన్న చొరవతోనే 300 మందికి లబ్ధి చేకూరిందని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా ఉన్న నాటి నుంచి జడ్పీ చైర్మన్గా పుట్ట మధూకర్ మంథని అభివృద్ధికి ఎంతో కృషిచేశారని, ఈరోజు మానేరుపై చెక్ డ్యాంలు, పెద్దపల్లి నుంచి మంథని వరకు 125 కోట్లతో రహదారి నిర్మాణానికి పుట్ట మధూకరే కారణమన్నారు. అనేక ఏండ్లు మంత్రిగా, ఎమ్మెల్యే ఉ న్నా ఏమీ చేయని వాళ్లు ఈనాడు మళ్లా ఏం చేస్తారనే ఆలోచన చేయాలని, ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలని సూచించారు.
40 ఏండ్లు పరిపాలన చేసినోళ్లు ప్రాజెక్టులు కట్టించిండ్లా..? నీళ్లు ఇచ్చిండ్లా..? కరెంటు ఇచ్చిండ్లా..? బడులు మంచిగా చేసిండ్లా..? అని ఆయన ప్రశ్నించారు. వాళ్లకు ఇలాంటి చేయడం చేతకాదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, సీ ఎం కేసీఆర్ నాయకత్వంలోనే ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేశామని, నీళ్లు, కరెంటు కష్టాలు తీర్చామని, మన ఊరు-మనబడి పేరిట పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించామన్నారు. విద్యా, వైద్య రంగాలను ఎంతో అభివృద్ధి చేశామని ఆయన గుర్తు చేశారు. తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఏమైనా నెగిటివ్ ఉందో చూపించాలని ప్రతిపక్ష నాయకులను ప్రశ్నించాలన్నారు. ప్రతి ఇంటిలో ఏదో ఒక పథకం ద్వారా లబ్ది జరిగి ఉంటుందని, అదే మనం వాళ్లకు చూపించాలని సూచించారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వ గెలుపును ఎవరూ ఆపలేరని, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో మురిపించి ముచ్చట్లు చెప్పటానికి వస్తున్నారని అలాంటి మాటలు నమ్మకుండా వాళ్లను నిలదీయాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి వస్తే ఏదో చేస్తామని చెప్పటోళ్లను.. తెలంగాణరాక ముందు ఏమీ చేయనోళ్లు మళ్లా ఏం చేస్తారని ప్రశ్నించాలని సూచించారు. ఆనా డు కరెంటు కోసం నీళ్ల కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూశామని, ఈనాడు అ లాంటి కష్టాలు లేవనే విషయాన్నిప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. దేశంలోనే అత్యధిక ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మనదేనని, చిన్న జిల్లాలు, మండలాలు, గ్రామాలు, మున్సిపాలీటీల ఏర్పాటుతో ఎంతో మందికి ఉద్యోగావకాశాలు వచ్చాయనే విషయాన్ని గుర్తించాలన్నా రు. ఎన్నికలు వస్తున్న వేళ బీజేపీ, కాంగ్రెస్ పి చ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నారని, అ లాంటి మాటలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చా రు. చరిత్రలో నిలిచిపోయే కాళేశ్వరం ప్రాజెక్టు ను నిర్మించి 44లక్షల ఎకరాలతోపాటు ఇతర ప్రాజెక్టులకు నీళ్లు అందిస్తుంటే.. ప్రాజెక్టు ప్ర యోజనాలను చూడకుండా కళ్లున్న కబోదుల్లా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
కాటారం డివిజన్ ఏర్పాటుకు కృషి ..
భూపాలపల్లి జడ్పీ చైర్పర్సన్ జకు శ్రీహర్షిణీ రాకేశ్ మాట్లాడుతూ, పుట్ట మదన్నను ఎమ్మెల్యేగా గెలిపించుకోవడమే లక్ష్యంగా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అయితే ఈ ప్రాంత కార్యకర్తల చిరకాల కోరికైన కాటారం మండలాన్ని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చే యాలని మంత్రిని కోరారు. దీంతో ఆయన స్పందించి, మంథని నియోజకవర్గంలో సెం టర్ పాయింట్గా ఉన్న కాటారం మండలాన్ని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసేందుకు ప్ర యత్నం చేస్తామన్నారు. ఈ విషయాన్ని రెం డు జిల్లాల జడ్పీ చైర్మన్లతోపాటు ఉమ్మడి జిల్లా మంత్రి గంగులతో కలిసి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని, ప్రజల సౌకర్యార్థం ఆయన కాదనరని అభిప్రాయం వ్యక్తం చేశారు.