ధర్మపురి, నవంబర్ 23: ధర్మపురి క్షేత్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. కార్తీక మాసం ముగింపు సందర్భంగా బుధవారం ధర్మపురి గోదావరి నదీ తీరాన నిర్వహించిన ముగింపు హారతి, అనంత దీపోత్సవం కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించగా మంత్రి ఈశ్వర్ దంపతులు పా ల్గొని గోదావరికి హారతినిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ధర్మపురి దేవస్థానం అభివృద్ధి కోసం రూ.100కోట్లు కేటాయించగా, టెంపుల్సిటీగా అద్భుతంగా తీర్చిదిద్దేలా పను లు నడుస్తున్నాయన్నారు. పవిత్ర గోదావరిలో మురుగునీరు కలువకుండా రూ.8కోట్లతో మ హాడ్రైనేజీ నిర్మాణంతో మురుగునీటి సమస్య తీరిందన్నారు. అలాగే ప్రధాన దేవాలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో పునర్నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయన్నారు. ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో ప్రధానం ఘట్టమైన పుట్టబంగారం సేకరణ స్థలం అభివృద్ధి, కోనేరుకు సాలాహారం దారి వెడల్పు పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
విజయదశమి రోజు న శమీ పూజ నిర్వహిం చే జంబి గద్దె ఆధునీకరించుకున్నామన్నారు. గోదావరి తీరాన మంగ ళి గడ్డ వద్ద మరియు పుష్కరఘాట్ల వద్ద డార్మెటరీలను నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. గోదావరి హారతి కోసం ప్రత్యేక వేదికను నిర్మిస్తామని తెలిపారు. ఇక్కడ దేవస్థానం ఈవో సం కటాల శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ సత్తె మ్మ, జడ్పీటీసీలు రాజేందర్, అరుణ, ఏఎంసీ చైర్మన్ రాజేశ్కుమార్, రెనొవేషన్ కమిటీ స భ్యులు ఇందారపు రామన్న, ఇనుగంటి రమావేంకటేశ్వర్రావ్, గందె పద్మశ్రీనివాస్, గునిశెట్టి రవీందర్, చుక్క రవి, సురేందర్ ఉన్నారు.