ధర్మపురి, అక్టోబర్9: ప్రభుత్వం ధర్మపురి ఆల య అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో అధోగతి పాలైన రాష్ర్టాన్ని గాడిలో పెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని చెప్పారు. సోమవారం ధర్మపురిలోని పలు వీధుల్లో 15.15 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ ముఖ్యమంత్రి దూరదృష్టితో చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతితో గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి పథంలో పరుగులు పెడుతున్నాయని చెప్పారు. ఇప్పుడు ఎటు చూసినా అద్దాల్లాంటి రహదారులు దర్శనమిస్తున్నాయని పేర్కొన్నారు. 250 కోట్లతో ధర్మపురి పట్టణాన్ని తీర్చిదిద్దామని చెప్పారు. కరోనా కారణంగా పనుల్లో ఆల స్యం జరిగినా, తర్వాతి కాలంలో జెట్స్పీడ్తో చేపట్టామన్నారు.
‘మన ఊరు-మన బడి’ పథకాన్ని ప్రారంభించి సర్కారు బడుల బలోపేతానికి చర్యలు చేపట్టిందన్నారు. అవసరం మేరకు ఒక్కో పాఠశాలకు 10లక్షల నుంచి 30లక్షలు ఖర్చుచేశామని చెప్పారు. ప్రస్తుతం సర్కారు బడులు కార్పొరేట్కు దీటుగా రూపుదిద్దుకున్నాయన్నారు. 6.50 కోట్ల తో పట్టణంలోని జాతీయ రహదారిని నాలుగు వరసలుగా విస్తరించామని తెలిపారు. సెంట్రల్లైటింగ్, కూడళ్ల సుందరీకరణతో పట్టణం దేదీప్యమానంగా వెలిగిపోతున్నదని చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లానీరు సరఫరా చేస్తున్నామన్నారు. ప్రజలు గత పాలకుల హయాంలో జరిగిన అభివృద్ధిని, తెలంగాణ సిద్ధించిన తర్వాత జరిగిన అభివృద్ధిని భేరీజు వేసుకొని, పనిచేసేవారిని ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, ఎంపీపీ చిట్టిబాబు, జడ్పీటీసీ అరు ణ, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేశ్కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, ఏఎంసీ వైస్చైర్మన్ అక్కనపల్లి సునీల్కుమార్, పాల్గొన్నారు.