ధర్మపురి/ధర్మపురి రూరల్, జూన్ 3: సీఎం కేసీఆర్ పాలనలో వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా, ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షే మ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ధాన్యభాండాగారంగా మారి సంతోషాల హరివిల్లులా ఓలలాడుతున్నదన్నారు. ఒకప్పుడు సాగునీటి లభ్య త లేక నెర్రెలు బారిన నేలలతో కూడిన తెలంగాణలో నిరాశ, నిస్పృహతో బక్కచిక్కిపోయిన రైతు వర్షాలు ఎప్పుడు వస్తాయా..? అన్నట్లుగా ఆకాశం వైపు చూస్తూ ఉండే సంఘటనలు అనేకం కనబడేటివని, కాని ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసిన పచ్చని పైర్లు… మోముల్లో చిరునవ్వులతో రైతులు ఎంతో ఉత్సాహంగా, హుషారుగా కనిపిస్తున్నారని మంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం ధర్మపురి మండలం నర్సయ్యపల్లి రైతువేదిక వద్ద, పొలాసలోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో నిర్వహించిన రైతు దినోత్సవంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. అంతకు ముందు ధర్మపురి పట్టణంలోని నంది చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ఎడ్ల బండ్ల ర్యాలీలో పాల్గొన్నారు. అక్కడ నుంచి రైతువేదిక వద్దకు రైతులు ఎడ్ల బండ్ల ర్యాలీ ద్వారా చేరుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… వ్యవసాయ రంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చూపించిన మార్గదర్శకంతో గణనీయమైన ప్రగతి సాధించుకోవడం తెలంగాణకే గర్వకారణం అన్నారు. గత పాలకులు వ్యవసా యం, సాగు నీటి రంగాలను పూర్తిగా విస్మరించడంతో ఇన్నేళ్లుగా అన్నదాతలు ఎన్నో కష్టాలు చవి చూడాల్సి వచ్చిందన్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ చేస్తున్న మరెన్నో మార్గద ర్శకాలను రైతులు తు.చ తప్పకుండా పాటిస్తే మరింత ప్రగతి సాధించడమే కాకుండా సమస్యలు అధిగమించిన వారు అవుతామన్నారు. ధా న్యం కొనుగోలు విషయంలో కొం దరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వాస్తవాలను రైతులకు అర్థమయ్యేలా చర్చించుకోవాలన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రాజెక్టులను పూర్తిచేసి నీళ్లు పారిస్తూ వ్యవసాయాన్ని పండుగ జేశారన్నారు. నిరంతరం విద్యుత్ సరాఫరా, సకాలంలో ఎరువులు, విత్తనాలు, రైతుబంధు, రైతుబీమా అందిస్తుండడంతో రైతుల ఆ నందాలకు అవధులు లేవన్నారు.
ఉచిత విద్యు త్ సరాఫరా కోసం రైతుల పక్షాన ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు రూ.12వేల కోట్లు చెల్లిస్తున్నదన్నారు. రైతుబంధు, రైతుబీమా దేశంలోని ఏరాష్ట్రంలో లేవన్నారు. సీమాంధ్రుల పాలనలో కరువు ప్రాంతంగా మారిన తెలంగాణ ఇప్పుడు దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా మా రిందన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మండలానికి ఇద్దరు, ముగ్గురు వ్యవసాయ విస్తరణ అధికారు లు మాత్రమే ఉండేవారని, ఇప్పుడు ప్రతి 5వేల ఎకరాలకు ఒక క్లస్టర్ను ఏర్పాటు చేసి ఒక్కో క్లస్టర్కు ఒక వ్యవసాయ విస్తరణాధికారిని నియమించామన్నారు. ఒక్క జగిత్యాల జిల్లాలోనే 71 రైతువేదికలను ఏర్పాటు చేసి రైతులకు సలహాలు, సూచనలు ఇస్తున్నారన్నారు. ఇటీవల జిల్లాలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన 380 మంది రైతులకు ప్రభుత్వం రూ.53 లక్షల పరిహారాన్ని వారి ఖాతాల్లో జమచేసిందన్నారు. రెండో విడుతలో రూ.38 కోట్ల పంటనష్టం వాటిల్లినట్లు అంచనా వేశారని, అవికూడా జమచేస్తారని తెలిపారు. వ్యవసాయ రంగా న్ని పండుగలా మార్చడంతో పాటు దేశానికి అన్నపూర్ణగా, సీడ్బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ అవతరించడం వెనుక ఎంతో శ్రమ, మేథోమథనం దాగి ఉన్నదన్నారు. తెలంగాణ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణను చూసి ఓర్వలేక, రా జకీయంగా ఎదుర్కొనే శక్తి లేక దురుద్దేశంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. ప్రగతి పథంలో దూసుకుపోతున్న తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డుపుల్ల వేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నదని మంత్రి ఆరోపించారు. కేంద్రం ఎన్ని ఆర్థిక పరమైన అడ్డంకులు సృష్టిస్తు న్నా, రైతు సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర ప్రభు త్వం పనిచేస్తున్నదన్నారు. ఇదే స్ఫూర్తితో సీఎం కేసీఆర్ నేతృత్వంలో కిసాన్ సర్కారు దేశంలో అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.
అభివృద్ధిని ఓర్వలేకే విమర్శలు
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్దిని చూసి ఓర్వలేకే కాంగ్రెస్ నాయకులు అర్థంలేని విమర్శలు చేస్తున్నారని మంత్రి ఈశ్వర్ మండిపడ్డారు. కాంగ్రెస్ కురువృద్ధుడు, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి కాళేశ్వర ప్రాజెక్టు గురించి మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ రైతాంగానికి కాళేశ్వరం నీరు అందేటిది జీవన్రెడ్డికి కనిపించడంలేదా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం, సుందిళ్ల, అన్నారం, తుపాకులగూడెం బరాజ్ల నీటితో గోదావరి నది నిండిపోయిందన్నారు. గోదావరిలో దాదాపు 250 కిలోమీటర్లు నీటితో నిండి పోయిఉందని, వెళ్లి చూసుకోవచ్చన్నారు. భవిష్యత్తులో రెండుమూడేళ్లు వరుసగా రాష్ట్రంలో వర్షాలు కురవపోయినా, పైనుంచి వచ్చే నీటితో ఎస్సారెస్పీ నిండకపోయినా రైతన్నలకు సాగునీటికి ఇబ్బందులు కలుగకుండా పనులు జరిగాయన్నారు.
ధర్మపురి అక్కపెల్లి చెరువులను రిజర్వాయర్గా మార్చాలని ఎన్నో ఏళ్లుగా ఇక్కడి రైతుల ఆకాంక్షగా గుర్తుచేశారు. అక్కపెల్లి చెరువు పునరుద్ధరణకు మొదటి రూ.3కోట్లు కేటాయించి, చెరువును గోదావరి నీటితో నింపేందుకు రూ.70కోట్లు వెచ్చించి గోదావరి ఒడ్డున లిఫ్ట్ నిర్మిస్తున్నామన్నారు. ముఖ్యంగా సాగునీటిపై దృష్టి సారించిన తెలంగాణ సర్కారు నీటికే నడత నేర్పిన సర్కారుగా అభివర్ణించారు. ఒక్క ధర్మపురి నియోజకవర్గంలోనే దాదాపు 25వేల ఎకరాలకు సాగునీరందించేందుకు. రూ.300 కోట్లు వెచ్చించి గోదావరి నదిపై 13 ఎత్తిపోతల పథకాలను నిర్మించుకున్నామన్నారు. 50 ఏళ్లుగా ఈ ప్రాంత వరదాయినిగా పేరుగాంచిన రోళ్లవాగును ఎవరూ పట్టించుకోలేదన్నారు. రోళ్లవాగు ఆధునీకరణ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగానే ఆయన వెంటనే స్పందించి రూ. 60.23కోట్లు మంజూరు చేయగా పనులు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ డీసీఎమ్మెస్ చైర్మన్ డా.శ్రీకాంత్రెడ్డి, డీఆర్డీఓ పీడీ లక్ష్మీనారాయణ, డీఏఓ సురేశ్కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, ఎంపీపీ చిట్టిబాబు, జడ్పీటీసీ అరుణ, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేశ్కుమార్, వైస్ చైర్మన్ అక్కనపల్లి సునీల్కుమార్, వైస్ ఎంపీపీ గడ్డం మహిపాల్రెడ్డి, తహసీల్దార్ వెంకటేశ్, ఎంపీడీఓ ప్రవీణ్, ఏడీఏ రామ్చందర్, నర్సయ్యపల్లి సర్పంచ్ లావణ్య తదితరులున్నారు.